కరోనాతో ప్రజల జీవన విధానమే మారిపోయింది. ఇక టాలీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. వేసవి పై పెట్టుకున్న ఆశలు మొత్తం తుడిచిపెట్టుకుపోగా.. ఇప్పుడు భవిష్యత్ ఏంటో తెలియని అయోమయం నెలకొంది. ఇప్పట్లో థియేటర్స్ తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. తెరిచినా జనాలు వస్తారన్న నమ్మకం లేదు. ఇక సినిమా షూటింగ్ లను మొదలుపెట్టడానికి హీరోలు, నిర్మాతలు ఏ మాత్రం సిద్ధంగా లేరనే చెప్పాలి. ఇంకా రిలీజ్ దగ్గర ఆగిపోయిన సినిమాలది మరో సమస్య. ఓటీటీ రిలీజ్ కి వెళ్లడమా లేదా థియేట్రికల్ రిలీజ్ వరకు ఆగుదామా అని తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలను నేరుగా రిలీజ్ చేసి ఓటీటీ వేదికలు చేతులు కాల్చుకున్నాయి. దీంతో భారీ మొత్తం చెల్లించి హక్కులు దక్కించుకోవడానికి తొందర పడటం లేదు.
టాలీవుడ్ లో చూస్తే.. నాని ‘వి’ , రామ్ రెడ్, రానా అరణ్య, అనుష్క నిశ్శబ్దం, వైష్ణవ తేజ్ ఉప్పెన వంటి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అరణ్య సినిమా పలు భాషల్లో రిలీజ్ కావాల్సి ఉండగా.. నాని, రామ్ సినిమాలు పూర్తి తెలుగు చిత్రాలు. అయితే వీ, రెడ్ సినిమాలను రిలీజ్ చేయడానికి ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చిన నిర్మాతలు ఒప్పుకోలేదు. ఒక సమయం లో వి
సినిమాకు రూ.30 కోట్లు, రామ్ రెడ్
సినిమాకు రూ.22 కోట్లు ఇస్తామని ఆఫర్లు వచ్చాయి. అయితే నిర్మాతలు థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు. పరిస్థితులు ఏ మాత్రం మారకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. నాని, రామ్ లకి కూడా ఇది టెన్షన్ పెంచుతోంది. బాలీవుడ్ లో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గణ్, అమితాబ్ వంటి స్టార్ల సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదల చేసేస్తున్నారు. అమితాబ్ ఝున్డ్, కాంచన రీమేక్ లక్ష్మి బాంబ్, జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా, మల్టీస్టారర్ చలాంగ్, శకుంతల దేవి, కూలీ నె౦ .1 వంటి పెద్ద సినిమాలు ఇందులో ఉన్నాయి.
You must be logged in to post a comment.